Chandrababu: ఓ అగంతకుడు రెచ్చిపోయాడు. ఏకంగా చంద్రబాబుపైనే రాయి విసిరాడు. ఆ రాయి చంద్రబాబు సెక్యూరిటీ అధికారి మధుబాబుకు తగిలింది. ఆయన తలకి స్వల్ప గాయమైంది. చంద్రబాబు సేఫ్.
నందిగామలో చంద్రబాబు ర్యాలీలో రాయి దాడి జరగడం కలకలం రేపింది. ఇది వైసీపీ గుండాల పనేనంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల భద్రత సరిగా లేకపోవడం వల్లే తనపై దాడి జరిగిందని ఆరోపించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదన్నారు చంద్రబాబు.