Telangana Weather : తెలంగాణలో అనేక ప్రాంతల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతోంది. చలికి చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్య బారిన పడుతున్నారు. ఉత్తర భారతం నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తుండటంతో పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 11 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక ప్రాంతాల్లో స్వల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 8.9 డిగ్రీలు, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 10.8 , ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.9 , రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్, మెదక్, నల్గొండ, భద్రాచలం జిల్లాల్లో స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి , నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ , సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉదయంపొ గ మంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జనవరిలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది.