ఓ ఫోన్ భార్య ,భర్తల మధ్య చిచ్చు పెట్టింది. నవ్వులు పోయి తెగులు అయినట్టు, మాట మాట పెరిగి కంట్లో కత్తెరతో పొడిచే వరకు వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్లో అంకిత్ అనే వ్యక్తి యూట్యూబ్లో పాటలు చూడటానికి తన భార్య ని ఫోన్ అడిగాడు. అందుకు తన భార్య ప్రియాంక నిరాకరించింది.
తన ఫోన్లో చూడమని చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ పెద్దగా మారింది. ప్రియాంక కోపంతో కత్తెర తీసుకుని అంకిత్ కంట్లో పొడిచింది. అంకిత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.