శ్రీకాకుళంలో తీవ్ర విషాదం నెలకొంది. లావేరు మండలంకు చెందిన ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ దామోదర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన చావుకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్తో పాటు లంకలపల్లి గోపి కారణమని సూసైడ్ నోట్ రాశారు. ఎమ్మెల్యే వేధింపులతో తను తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తన చావుకు కారణమైన ఎమ్మెల్యేతో పాటు ఎవరినీ విడిచిపెట్టొద్దని సూసైడ్నోట్లో విజ్ఞప్తి చేశాడు దామోదర్.
అయితే దామోదర్ ఆత్మహత్యపై స్పందించిన ఎమ్మెల్యే కిరణ్కుమార్.. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దామోదర్ రిపోర్టరే కాదు.. క్రియాశీల కార్యకర్త కూడా అని తెలిపారు. గత 3 రోజుల క్రితం దామోదర్ తప్పిపోయినట్లు తెలిసిందని.. ఈ విషయంపై అతని ఆచూకీ కోసం పోలీసులను కూడా ఆదేశించినన్నారు. దామోదర్ ఆత్మహత్యతో తనకు సంబంధం ఉందనేదాని తనపై ఏదో కుట్రకోణం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇటీవలి కాలంలో మాట్లాడిన తన ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుతేల్చాలని పోలీసులను కోరినట్లు ఎమ్మెల్యే కిరణ్కుమార్ తెలిపారు. దామోదర్ కేవలం రిపోర్టర్ మాత్రమే కాదని.. క్రియాశీల కార్యకర్త కూడా అన్నారు. మూడురోజులుగా అతను కనిపించడంలేదని తనకు తెలియడంతో.. సీఐకి, స్థానిక ఎస్సైకి అతని ఆచూకీ తెలుసుకోవాలని చెప్పినట్లు ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తెలిపారు.