CM Jagan : జనవరి, ఫిబ్రవరిలో చేపట్టే కార్యక్రమాలపై సీఎం జగన్ ..కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలిచ్చారు. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రెండు నెలల్లో 4 ప్రధాన కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రోగామ్స్ ను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
CM Jagan : జనవరి, ఫిబ్రవరిలో చేపట్టే కార్యక్రమాలపై సీఎం జగన్ ..కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలిచ్చారు. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రెండు నెలల్లో 4 ప్రధాన కార్యక్రమాలు చేయబోతున్నామని తెలిపారు. ఈ ప్రోగామ్స్ ను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
వైఎస్ఆర్ పింఛన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అంబేడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవంపై సీఎం జగన్ చర్చించారు. జనవరి 1 నుంచి పింఛన్ ను రూ.3వేలకు పెంచుతున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
జనవరి 1 నుంచి 8 వరకు పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్దేశించారు. జనవరి 19న విజయవాడలో అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కర కార్యక్రమం జరగుతుందని తెలిపారు.
జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా పథకం అమలు చేస్తామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ 4 కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ ఆదేశించారు.