Rahul Gandhi : బీజేపీ ఎంపీలకు భయం పట్టుకుందని అందుకే అధికారం కోసం కుట్రలు చేస్తున్నారని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ నాగ్ పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కొంత మంది బీజేపీలో ఉన్నా..వాళ్ల మనసంతా కాంగ్రెస్ వైపే ఉందన్నారు. ఎందుకంటే బీజేపీలో బానిసత్వం ఉంటుంది. అది అన్ని వ్యవస్థలను ధ్వంసం చేయడానికే ఉందన్నారు. దేశంలో అధికారం ప్రజల చేతుల్లో ఉండాలి కానీ బీజేపీ పాలనలో కొంత మంది పెద్దల చేతుల్లోనే ఉందని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ దేశానికి ఏం ఇచ్చింది అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. సంస్థానాలకు, బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. ఈ దేశం కోసం నెహ్రూ, గాంధీలు జైలుకెళ్లారన్నారు. రైతులపై బీజేపీ జీఎస్టీ విధించింది. రైతుల జీవితాలను ఆడుకుంటుంది. మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీతో కాంగ్రెస్ పార్టీ సైద్దాంతికంగా పోరాడతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి విలువ ఉంటుంది, బీజేపీలో ఎంపీల అభిప్రాయాలకే విలువ లేదన్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్నతేడా ఇదే అన్నారు. బీజేపీలో ఇప్పటికీ రాజరికం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ఉందన్నారు.