బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఇటీవల విడుదలైన యానిమల్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సందర్భంగా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ నాడు రణబీర్ కపూర్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుక జరుపుకుంటూ కేక్ పై మద్యాన్ని పోసి నిప్పంటించి “జై మాతా ది “అని రణబీర్ చేసిన కామెంట్ అతన్ని చిక్కుల్లో పడేసింది . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది .
సాధారణంగా హిందువులు ఏదైనా పూజ చేసేటప్పుడు అగ్నికి ముందుగా ప్రార్ధించి అనంతరం పూజను ప్రారంభిస్తారు . కాగా రణబీర్ ,అతని కుటుంబ సభ్యులు ఉద్దేశపూర్వకంగా క్రైస్తవ మతం పండుగను జరుపుకునే సమయంలో మద్యాన్ని ఉపయోగించి జై మాతా ది అని నినాదాలు చేశారని విమర్శలొచ్చాయి. ఈ వీడియో కొంతమంది మండిపడ్డారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్ ప్రవర్తించారని అంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు ఈ యానిమల్ హీరో.
ఈ వీడియో దుమారం రేపుతుండగా .. ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ లో సంజయ్ తివారీ అనే వ్యక్తి తన న్యాయవాదులు ఆశిష్ రాయ్ , పంకజ్ మిశ్రా ద్వారా రణబీర్ , అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. రణబీర్ కపూర్ “జై మాతా ది “అని చెప్పగానే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా జై మాతా ది అన్నట్టు సంజయ్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు . అతనికి హిందూ సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ఇప్పుడు రణ్ బీర్ వీడియోపై పెద్ద దుమారం రేగుతోంది.