Suicide : ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం ఏలూరు వన్ టౌన్ పోణంగి దక్షిణపు వీధి ప్రాంతాంలో చోటుచేసుకుంది. తమ కుమార్తె వీణా మాధురిని వేముల మోషే అనే యువకుడు వేధించడం వల్లే ఆత్మహత్యకు పాలపడినట్లు తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.
వివరలోకి వెళితే.. వడ్డెరగూడెం చిరంజీవి బస్టాండ్ సమీపంలో వేముల మోషే నివాసం ఉంటున్నాడు. గతంలోను వీణా మాధురిని ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలున్నాయి. అప్పట్లో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి వేముల మోషేను అరెస్టు చేశారు.
బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ వేధింపులకు గురిచేయటంతో వీణా మాధురి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. తమ కుమార్తె మరణానికి కారణమైన మోషేను శిక్షించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.