Prakash Raj On Moinabad Farm House Case : ఓ పక్క సినిమాలు చేస్తూనే.. ఎప్పటికప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయాలపై సమస్యలపై ఆయన సంచలన కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఢిల్లీ నుంచి వచ్చిన సిగ్గులేని బ్రోకర్లు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు” అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వైరల్ అయిన వీడియోను తాను చేసిన పోస్ట్కు అటాచ్ చేశారు.
ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వంపైన కూడా ఆయన ఇదే తరహాలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఎన్నికలకు ముందు బీజేపీతో సంబంధం ఉన్న కొందరు మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చర్చించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ తరువాత వీరిని కొనుగోలుకు ప్రత్యత్నించిన నలుగురిని పట్టుకున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. విచారణ కొనసాగుతోంది. మునుగోడు ఎన్నికల తరువాత మీడియా ముందు సీఎం కేసీఆర్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ హాట్ కామెంట్స్తో జాతీయ మీడియాలో ప్రచారం అయిన తరువాత ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు.