EPAPER

Prakash Raj On Moinabad Farm House Case : సిగ్గులేని బ్రోకర్లు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : ప్రకాష్ రాజ్

Prakash Raj On Moinabad Farm House Case : సిగ్గులేని బ్రోకర్లు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : ప్రకాష్ రాజ్

Prakash Raj On Moinabad Farm House Case : ఓ పక్క సినిమాలు చేస్తూనే.. ఎప్పటికప్పుడు దేశంలో జరుగుతున్న రాజకీయాలపై సమస్యలపై ఆయన సంచలన కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఢిల్లీ నుంచి వచ్చిన సిగ్గులేని బ్రోకర్లు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు” అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వైరల్ అయిన వీడియోను తాను చేసిన పోస్ట్‌కు అటాచ్ చేశారు.


ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వంపైన కూడా ఆయన ఇదే తరహాలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఎన్నికలకు ముందు బీజేపీతో సంబంధం ఉన్న కొందరు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చర్చించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే ఈ వ్యవహారంపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ తరువాత వీరిని కొనుగోలుకు ప్రత్యత్నించిన నలుగురిని పట్టుకున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. విచారణ కొనసాగుతోంది. మునుగోడు ఎన్నికల తరువాత మీడియా ముందు సీఎం కేసీఆర్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ హాట్ కామెంట్స్‌తో జాతీయ మీడియాలో ప్రచారం అయిన తరువాత ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు.


Tags

Related News

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Love Reddy Movie Review : లవ్ రెడ్డి మూవీ రివ్యూ…

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Big Stories

×