ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో.. వైసీపీ అధినేత, సీఎం జగన్ కి పార్టీ నేతల తీరు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వైసీపీలో మార్పులు, చేర్పులు కారణంగా కార్యకర్తల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులే ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
శ్రీశైలం మల్లన్న సన్నిధి వేదికగా వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మధ్య సెటైర్ల పర్వం నడిచింది. ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ నేతలు శంఖుస్థాపన చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు కౌంటర్లు వేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ముందుగా సభలో మంత్రి కొట్టు మాట్లాడుతూ.. ట్రస్టు బోర్డు మెంబర్ విరూపాక్షయ్య… మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. దాంతో వెంటనే నేను మాట్లాడే సమయంలో మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు మైకు కింద పెడితే బాగుంటుంది అంటూ మంత్రి సర్దిచెప్పే యత్నం చేశారు. కానీ ఆ తర్వాత కూడా మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. దాంతో చివర్లో మేమంతా ఒకటే.. అంటూ మంత్రి కవర్ చేసే ప్రయత్నం చేశారు.