Ganja seized: రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 80 కేజీల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి , డ్రగ్స్ క్రయ విక్రయాలపై నిఘా పెంచారు. నూతన ఏడాది ప్రవేశిస్తుడటంతో భారీగా గంజాయి పట్టుబడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై సీరియస్గా వ్యవహరిస్తుంది.
Ganja seized: రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 80 కేజీల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి , డ్రగ్స్ క్రయ విక్రయాలపై నిఘా పెంచారు. నూతన ఏడాది ప్రవేశిస్తుడటంతో భారీగా గంజాయి పట్టుబడుతుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై సీరియస్గా ఉంది. డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. తప్పించుకున్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ పోలీసులు ప్రకటించారు.