Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియా సమావేశంలో ప్రకటించారు.
ఆనారోగ్య కారణాలు వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.
Giddalur : ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అందుకే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రకటించారు. అనారోగ్య కారణాలు వలన ఈ నిర్ణయం తీసుకుంటున్నాని వెల్లడించారు.
“వైసీపీలో ముఖ్య సామాజిక వర్గం నన్ను లక్ష్యంగా చేసుకుని నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సమస్యను జిల్లాలో పార్టీ నేతలకు చేప్పిన పట్టించుకోవడం లేదు. మాగుంట ఓటమి కోసం జిల్లా అంతటా త్వరలోనే పర్యటిస్తానని ప్రకటించారు. 34 ఏళ్లుగా మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు ఏమి చేయ్యవలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలలో మాగుంట కుటుంబాన్ని ఆదరించవద్దని” ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు.