Andhra Pradesh : ఏపీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో విక్టరీతో ఫుల్ జోష్లో ఉన్న హస్తం పార్టీ.. ఆ దిశగా ప్రణాళికలకు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నాళ్లనుంచో రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్.
ఈ ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఏపీకి 10 గ్యారంటీలు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంపైనా ఫోకస్ పెట్టింది. 3 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు రావాలని ఏపీ నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఇలా ప్రచారం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.
సీఎం జగన్ను టార్గెట్ గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అధికార వైసీపీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. జగన్ సర్కార్ ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అంటున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం చేపట్టిన 10 గ్యారంటీలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సాధించాలని యోచిస్తోంది.
.
.