EPAPER

Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమలాపురం వాసులు మృతి..

Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అమలాపురం వాసులు మృతి..

Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన టెక్సాస్ హైవేలో చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని ఏపీలోని అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు.


జాన్సన్‌ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియలేదు.

మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. ప్రమాదంలో పోన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో అమలాపురంలో బంధువుల ఇళ్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×