Pressure Foods : ఆందోళన, చిరాకు, ఒత్తిడి అనేది ప్రతి మనిషిలోనూ రోజులో ఏదో ఒక సమయంలో ఉండే సాధారణ సమస్య. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అతిగా కోపం, ఒత్తిడి, ఆందోళన వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. అయితే, కొన్ని ఆహార పదార్థాలు కూడా మనిషిని ఆందోళనలో నెట్టేస్తాయట. వాటిని గుర్తించి దూరం పెట్టేద్దాం రండి.
అవసరానికి మించి టీ లేదా కాఫీ తాగితే.. అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీని మూలాన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.
ఫాస్ట్ఫుడ్ను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ అది మెదడును ప్రభావితం చేస్తుంది.
చాలామంది ఎక్కువగా వేయించిన ఆహారాన్ని చిరుతిండిగా తీసుకుంటారు. ఇవి మనిషిలో ఆందోళన సమస్యలను కలిగిస్తుంది.
కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. పరిశోధన ప్రకారం.. అధిక మొత్తంలో తీపి, కొవ్వు పదార్థాలను తినడం.. ఒత్తిడిని పెంచుతుంది.