తెలంగాణలో ప్రజా పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పాలకు వ్యతిరేకంగా.. తాము ప్రజా పాలన చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్. ఈ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి.. ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్న సంకల్పంతో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రభుత్వ పథకాల అమలే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ ప్రోగ్రాంను నిర్వహించనుంది సర్కార్. తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పాలకు వ్యతిరేకంగా.. తాము ప్రజా పాలన చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీకి తాము కట్టుబడి ఉన్నామని.. చెప్పినట్టుగానే 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీంలను అమలు చేస్తామంటోంది. ఈ మేరకు ప్రజల చెంతకే పాలనను తీసుకు వెళ్తామని.. మారుమూల గ్రామాలే కాదు.. అటవీప్రాంతాల్లో ఉండే గిరిజనుల వద్దకు కూడా తమ అధికారులు వెళ్లి సంక్షేమ ఫలాలు అందిస్తామంటున్నారు హస్తం నేతలు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఇందుకుగాను అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారంను సిద్ధం చేసింది సర్కారు. అయితే.. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది.