నిజానికి క్రికెటర్లు అంటే, ఎంతోమంది అమ్మాయిలు ముచ్చట పడుతుంటారు. అయితే వీరు ఆటలో చూపించే అత్యుత్సాహమే, జీవితంలో కూడా చూపించి ఒకొక్కసారి క్లీన్ బౌల్డ్ అవుతుంటారు. అలాంటి వారిలో ఒకరు శిఖర్ ధావన్ అని చెప్పాలి. భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్నాక, ఏడాదిగా కొడుకుని చూడలేక సతమతం అవుతున్నాడు. దీంతో కొడుకు జొరావర్ పుట్టినరోజు సందర్భంగా తను పెట్టిన ఎమోషనల్ పోస్టు చూసి నెట్టింట జనం చలించిపోతున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు.
టీమ్ ఇండియాలో ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్ లను గెలిపించి అనూహ్యంగా తుది జట్టులో స్థానం కోల్పోయిన ధావన్, ఇటు ఆటలో, అటు జీవితంలో తగిలే ఎదురు దెబ్బలకు నలిగిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తను కొడుకుపై గుండెల్లో పెంచుకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు.
‘‘చిన్నా.. నిన్ను చూసి అప్పుడే ఏడాది గడిచిపోయింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో నన్ను బ్లాక్ చేశారు. ఏ విధంగా కూడా నిన్ను కలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకే నీకు ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చింది.
నిన్ను కలవాలని, నీతో ఆడుకోవాలని, నీతో కబుర్లు చెప్పాలని, నీ ఎదుగుదలను కళ్ల ముందే చూడాలని, నీవు కూడా నా అంతటివాడివి కావాలని ఎన్నోకలలు కన్నాను. కానీ ఇప్పుడవేవీ చూడలేకపోతున్నాను. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే, నిన్ను టెలీపతి ద్వారా కలుసుకుంటాను. నువ్వు బాగున్నావని.. చక్కగా ఎదుగుతున్నావని నాకు తెలుసు. నిన్ను చూసి ఒక తండ్రిగా నాకెంతో గర్వంగా ఉంది.
నిన్ను నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. ఆ దేవుడి దయతో మళ్లీ మనం కలిసే క్షణాల కోసం ఎదురుచూస్తుంటాను. నువ్వు అల్లరి పనులు చేయు .. కానీ వస్తువులు పాడు చేయొద్దు. ఎప్పుడూ ఒకరికి ఇచ్చేలాగే ఉండు.. ఇట్లు మీ నాన్న… ’’అంటూ సందేశం పంపాడు.
ఇప్పుడీ సందేశం నెట్టింట వైరల్ గా మారింది. ధావన్ భార్య ఆయేషా ముఖర్జీని అందరూ తిట్టిపోస్తున్నారు. పనిలో పనిగా ధావన్ ని కూడా తిడుతున్నారు. ఆల్రడీ పెళ్లయి, పిల్లలు ఉండి, నీకన్నా పదేళ్లు పెద్దదైన ఆమెని ఏం చూసి పెళ్లి చేసుకున్నావని అభిమానంతో తిడుతున్నారు. నిజానికి క్రికెటర్లు, సెలబ్రిటీలు అంటే అమ్మాయిలు వెంటపడతారు. అంతమందిని వదిలేసి, ఈ మహాతల్లే దొరికిందా? అని చురకలు కూడా అంటిస్తున్నారు.
కొందరేమో ధావన్ పోస్టు చూసి గుండె పగిలింది అంటున్నారు. కొందరేమో కన్నీళ్లు ఆపుకోవడం నా వల్లకాలేదని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే అసలు ధావన్ భార్య ఆయేషాతో ఉన్న బంధంపై మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నారు.
అయేషా ముఖర్జీ (48) మెల్ బోర్న్ కి చెందిన కిక్ బాక్సర్.. తను భారతదేశంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి బెంగాలీ, తల్లి బ్రిటిషర్. ఆయేషా పుట్టిన తర్వాత వీరిద్దరూ ఆస్ట్రేలియా కి వెళ్లి స్థిరపడ్డారు. అందువల్ల తను అక్కడే చదువుకుంది. కిక్ బాక్సింగ్ నేర్చుకుంది. ఇప్పుడు జీవితంలో ధావన్ పై పంచ్ లు విసురుతోంది.
నిజానికి ధావన్ కంటే అయేషా పదేళ్లు పెద్దది. 2009లో వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది. 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇది అయేషాకు రెండో పెళ్లి అయితే.. ధావన్కు మొదటి వివాహం. పెళ్లయిన ఏడాదికి అయేషా, ధావన్ దంపతులకు జొరావర్ జన్మించాడు. అయితే అయేషాకు మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు అమ్మాయిలను ధావన్ దత్తత తీసుకున్నాడు. పెళ్లయ్యాక ఇండియాలోనే ఉంటానని చెప్పిన అయేషా.. ఆస్ట్రేలియాలో ఉండటం మొదలుపెట్టింది. జొరావర్ కూడా ఆస్ట్రేలియాలోనే పుట్టాడు. ఇది వీరిద్దరి మధ్య విభేదాలకు దారి తీసింది.
అంతేకాదు నిత్యం డబ్బుల కోసం వేధిస్తూ కోట్ల రూపాయలు ధావన్ దగ్గర గుంజింది. అలాగే ధావన్ కూడా మూడు ఇళ్లు ఆస్ట్రేలియాలో కొన్నాడు. రెండు ఆమె పేరునే పెట్టాడు. ఎందుకైనా మంచిదని ఒకటి తన పేరు మీద ఉంచుకున్నాడు. జోరావర్ తోపాటు ఇద్దరు అమ్మాయిలు స్కూల్ ఫీజులు, వారి ప్రయాణపు ఖర్చులు, ఆమె జల్సాలు ఇలా మొత్తం లాగి లాగి వదిలింది. అంతేకాదు ధావన్ ని మానసికంగా క్షోభకు గురి చేసింది. ఈ బాధలు పడలేక ధావన్ ఢిల్లీ కోర్టులో కేసు వేశాడు.
ధావన్ ఆవేదన విన్నకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు చెప్పి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు కొడుకుని చూసేందుకు, వీడియో కాల్ మాట్లాడేందుకు అనుమతిచ్చింది. సెలవు రోజుల్లో ధావన్ కుటుంబంతో గడిపేందుకు అనుమతిచ్చింది. మొన్నటి వరకుఅంతా బాగానే ఉంది. మూడునెలల నుంచి ఆయేషా మొత్తం కొడుకుని ధావన్ తో కలవకుండా కట్టుదిట్టం చేసింది. దీంతో కొడుకు పుట్టినరోజున ధావన్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ఇ ప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.