Sabarimala temple closed
శబరిమల దేవస్థానం తలుపులు మూతపడనున్నాయి. రేపు అంటే.. డిసెంబర్ 27వ తేది రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. మండల పూజ ముగింపు మహోత్సవం పూర్తయిన అనంతరం ఆలయ తలుపులను మూసివేయనున్నారు. తిరిగి మకరవిళక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులను తెరుస్తారు. అప్పటి నుంచి మకరజ్యోతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
జ్యోతి దర్శనం.. జనవరి 15వ తేదీ సాయంత్రం 6.36 గంటలకు ఉండనుంది. ఆ తర్వాత అయ్యప్పల మాల విరమణల అనంతరం జనవరి 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. కాగా.. మరికొద్దిగంటల్లో ఆలయం మూతపడనుండగా అయ్యప్ప దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్ప దర్శనానికి సుమారు 15 గంటలకు పైగా సమయం పడుతుందని ట్రావెన్ కోర్ బోర్డ్ అధికారులు తెలిపారు. మకరవిళక్కు పూజలకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో.. ఆలయ కమిటీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తోంది.