EPAPER

Mumbai : భారత్ వాణిజ్య నౌకలపై దాడులు.. రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Mumbai: ఇండియాకు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా ఖండించినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. కార్గో షిప్పులపై వరుసగా దాడుల జరుగుతున్న నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. దీనికి కారణం అయిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Mumbai :  భారత్ వాణిజ్య నౌకలపై దాడులు..  రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Mumbai : ఇండియా వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.. కార్గో షిప్పులపై వరుసగా దాడుల జరుగుతున్న నేపథ్యంలో సముద్ర జలాల్లో గస్తీని ముమ్మరం చేసినట్లు ప్రకటించారు. ఈ దాడులకు పాల్పడిన వారిని సముద్రంలో ఎక్కడ దాక్కున్నా వేటాడి, పట్టుకుంటామని స్పష్టం చేశారు. దీనికి కారణం అయిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ ఇంఫాల్‌ ’ను ముంబై వేదికగా నౌకాదళంలో ప్రవేశపెట్టిన సమయంలో నౌకల దాడి అంశాన్ని రాజ్ నాథ్ ప్రాస్తావించారు. ఎంవీ కెమ్‌ ప్లూటో వాణిజ్య నౌకపై డ్రోన్‌తో దాడి జరగడం వాస్తవమేనని భారత నేవీ ప్రకటించింది. గుజరాత్‌ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్‌ ప్లూటో’పై డిసెంబర్‌ 23న డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న భారత నౌకాదళం వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టింది. ‘ఐసీజీఎస్‌ విక్రమ్‌’ రక్షణతో ఆ వాణిజ్య నౌక ముంబై పోర్టుకి చేరుకుంది.

ఈ దాడి ఇరాన్‌ భూభాగంపై నుంచే జరిగిందని అమెరికా రక్షణశాఖకు చెందిన పెంటగాన్‌ ప్రకటించింది. అయితే, అమెరికా ఆరోపణలను ఇరాన్‌ ఖండించింది. అమెరికా ఆరోపణలలో వాస్తవం లేదని ఇరాన్ ప్రకటించింది. అంతకుముందు ‘ఎంవీ సాయిబాబా’ నౌకపైనా దాడి జరిగింది. ఈ పరిణామాలతో కేంద్రం హెచ్చరించింది.


Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×