Maa Oori Polimera 2 : క్రైం సస్పెన్స్, సూపరిస్టిషన్ నేపథ్యంలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ మూవీకి కొనసాగింపుగా ‘మా ఊరి పొలిమేర 2’ నవంబర్లో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించగా.. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందుమౌళి, గెటప్ శీనులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ డిసెంబర్8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ
అందరూ చనిపోయాడు అనుకున్న కొమరయ్య (సత్యం రాజేష్).. తప్పుంచుకుని వేరేచోట కొమిరి పేరుతో జీవిస్తుంటాడు. కొమరయ్యను వెతుక్కుంటూ జంగయ్య(బాలాదిత్య) వెళ్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా వచ్చిన రవీంద్ర నాయక్(రాకేందుమౌళి) కొన్ని నిజాలు తెలసుకుంటాడు. ఇంతలో బలిజ(గెటప్ శీను) కొమరయ్యను కనుక్కోగా ఊరి గుడి గురించి నిజాలు తెలుసుకుంటాడు. కొమరయ్య ఎలా బ్రతికాడు? ఆ గుడి నిజాలు ఏంటి? ఎస్సైకి తెలిసిన నిజాలు ఏంటి? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
ఈ మూవీలో చూపించే గుడి పూజలకు సంబంధించిన సీన్స్ కొంచెం భయపెడతాయి. పార్ట్ వన్లో మర్డర్ మిస్టరీకి చేతబడిని యాడ్ చేస్తే.. ఈ మూవీలో గుప్త నిధులు అనే పాయింట్ను యాడ్ చేశారు. బలిజ.. కొమరయ్యను కలిశాక వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్ బాగుంటాయి. సత్యం రాజేష్, కామాక్షి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. మిగిలిన వారు వారి పాత్రమేరా న్యాయం చేశారు.