Sunburn Event : హైదారాబాద్ లో సన్బర్న్ ఈవెంట్ ను ఆర్గనైజర్స్ క్యాన్సిల్ చేశారు. న్యూ ఇయర్ వేళ మదాపూర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తొలుత ఏర్పాట్లు చేశారు. బుక్మై షోలో టికెట్ల విక్రయాన్ని కూడా ప్రారంభించారు. పోలీసులు అనుమతి ఇవ్వకముందే టిక్కెట్స్ విక్రయాలపై వివాదం రేగింది.
సన్ బర్న ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్పై కేసు నమోదైంది. అనుమతి తీసుకోకుండా టికెట్లు విక్రయించినందుకు గానూ బుక్ మై షోపై చర్యలు చేపట్టారు. బుక్ మై షోకు నోడల్ అధికారులు నోటీసులిచ్చారు. ఆ తర్వాత నుంచి బుక్ మై షోలో సన్ బర్న్ ఈవెంట్ టిక్కెట్స్ విక్రయాలను నిలిపివేశారు.
సన్బర్న్ అనేది మెగా మ్యూజిక్ ఈవెంట్. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మద్యం తాగేందుకు అనుమతి ఉంటుంది. అందువల్లే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని ఈవెంట్ పైవిమర్శలున్నాయి.
సన్ బర్న్ ఈవెంట్కు ఎవరు అనుమతి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు ఈవెంట్ ఆర్గనైజర్స్, బుక్ మై షో ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈవెంట్ను రద్దు చేశారు.