Himachal Pradesh : ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోటానికి కొందరు పర్యాటకులు రోడ్డు మార్గం వదలి నదిలో నుంచి ప్రయాణించారు. క్రిస్మస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో పర్యాటకుల తాకిడి పెరిగింది . దీంతో మనాలి, అటల్ టన్నెల్ రోడ్డు మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు.
ట్రాఫిక్ ని తప్పించుకునే ప్రయత్నంలో కొందరు ప్రయాణికులు థార్ ఎస్యూవీలో లహాల్ వ్యాలీలోని చంద్రా నదిలో నుంచి ప్రయాణించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. నదిలో ప్రయాణించిన ప్రయాణికుల తీరును స్థానికులు విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్నపోలీసులు వాహనానికి చలానా వేశారు. నదిలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఘటన తమ దృష్టికి వచ్చిందని స్థానిక ఎస్పీ చెప్పారు. ఆ పర్యాటకులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.