చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లి పంచాయితీలో రైతులపై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు ఖండించారు. గ్రామంలో రోడ్డు విషయంలో తలెత్తిన వివాదంలో రైతులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రైతులను చికిత్స కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న రైతుల ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు పార్టీ నేతలను ఆరా తీశారు. రైతులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చంద్రబాబు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు సూచించారు. రైతులపై దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యను సామరస్యంగా పరిష్కరించేలా చూడాలని కుప్పం నేతలతో చంద్రబాబు అన్నారు.