కుటుంబ కలహాలు ఇద్దరి జీవితాలను చిదిమేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో ఓ ఇల్లాలు తన ఐదేళ్ళ బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం అంజలి అనే మహిళకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నరు. కొద్ది రోజులుగా తరచూ భర్తతో గొడవలు జరుగుతుండేవి.
మనస్తాపానికి గురైన అంజలి సోమవారం రోజు తన ఐదేళ్ల చిన్నారిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి కూతురు గురించి వెతికారు. చివరికి బావిలో వారి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.