Maoists Encounter : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. నిన్న పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. కట్టెకళ్యాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని దబ్బకూన గ్రామ సమీపంలోని కొండపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్లు పాల్గొన్నారు.
దంతెవాడ-సుక్మా జిల్లా సరిహద్దుల్లో తుమక్పాల్-దబ్బకూన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం సమీప ప్రాంతాల్లో గాలించగా మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. పేలుడు పదార్థాలు, ఆయుధాలు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు, ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు.