KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఏడాది జనవరి 30న హైదరాబాద్లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. అలాగే సదస్సుని నిర్వహించడానికి కావల్సిన అనుమతులు మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. ప్రపంచ శాంతి సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు వివరించారు. పలు దేశాల నుంచి వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు.