EPAPER

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : రెండు రోడ్డు ప్రమాదాలు.. కుటుంబంలో ఐదుగురు మృతి..

Nalgonda Road Accidents : నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలం వెంపాడ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చూడటానికి వస్తూ మరో నలుగురు మృతి చెందారు. రమావత్ కేశవ్ (19) అనే వ్యక్తి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాగరాజు(28) అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక.. కేశవ్ ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కేశవ్ కుటుంబ సభ్యులు మృతుడిని చూసేందుకు టాటా ఏస్ లో వస్తుండగా పార్వతీపురం దగ్గర ట్యాంకర్ ఢీ కిట్టింది.


ఈ ప్రమాదంలో టాటా ఏస్ లో ఉన్న ఏడుగురు ప్రయాణికుల్లో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన రమావత్ కేశవులు, రమావత్ గణ్య, నాగరాజు, రమావత్ పాండు, రమావత్ బుజ్జి లుగా గుర్తించారు. రెండు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.


Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×