Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిమౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.
Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.
ఈ నృత్య ప్రదర్శనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వేలాది మంది ఇంత అద్భుతంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గాను గిన్నిస్ రికార్డు లభించింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ భారత్ ఆర్ట్ అకాడమీ సొంతమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.