Transfers : తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆరుగురు ఐఏఎస్లను, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎక్సైజ్ కమిషనర్గా ఇ.శ్రీధర్లను ప్రభుత్వం నియమించింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలీ కెరీర్ పై బదిలీ వేటు పడింది. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పోట్రు నియమితులయ్యారు. ఇంటర్ బోర్డు డైరెక్టర్గా శృతి ఓఝా, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్గా నర్సింహా రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.