Narayanapet : నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. 167 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఒక కారులో ఉన్న ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. మృతులు తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్ కార్డులు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందినవారుగా గుర్తించినట్లు వెల్లడించారు.