Vivo Money Laundering Case | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు చైనీస్ స్మార్ట్ఫోన్ సంస్థ వివోకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు.
Vivo Money Laundering Case | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు చైనీస్ స్మార్ట్ఫోన్ సంస్థ వివోకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. PMLA (Prevention of Money Laundering Act) చట్ట ప్రకారం ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. కానీ అరెస్ట అయిన ముగ్గురి గుర్తింపుని వెల్లడించలేదు.
ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో వివో ఇండియా ఆఫీసులు, దాని అనుబంధ కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు నిర్వహించి రూ.62,476 కోట్ల అక్రమ నిధులు చైనాకు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
ఇంతకుముదు ఈ కేసులో చైనాకు చెందని ఓ వ్యక్తి గుయాంగ్వేన్తో పాటు, ఇద్దరు చార్టర్డ్ అకౌటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మలిక్, లావా మొబైల్ కంపెనీ డైరెక్టర్ హరి ఓం రాయ్ని అరెస్టు చేశారు. ఈ కేసు ప్రస్తుతం ఓ ప్రత్యేక కోర్టులో విచారణ దశలో ఉంది.