Nizamabad : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల శానిటరీ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని దేవీ రోడ్లో ఉన్న బాలజీ శానిటరీ దూకాణంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగింది. మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఫైర్ సిబ్బంది నాలుగు గంటల పాటు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు తీవ్రం కావడంతో ఫైర్ సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. మంటలు ఆర్పుతున్న సమాయంలో దుకాణంలో ఉన్న కలర్ ,స్పిరిట్ వల్ల ఫైర్ సిబ్బంది నలుగురికి గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని బాధితుడు పేర్కొన్నాడు.