Bank of Baroda: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి భారీగా జరిమానా వడ్డించింది. చిరిగిన నోట్ల మార్పిడి లావాదేవీల్లో వ్యత్యాసం ఎక్కువగా కనిపించడంతో.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా.. శుక్రవారం జరిగిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో వెల్లడించింది. చిరిగిన నోట్ల లావాదేవీల్లో నకిలీ నోట్లు గుర్తించడంతో అదనంగా మరో రూ.2750 జరిమానా పడింది.
డిసెంబర్ 18,20 తేదీల్లో వేర్వేరుగా జరిమానాలు విధించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. గత నెలలో కూడా BOBకి ఆర్బీఐ పెనాల్టీ విధించింది. పెద్దమొత్తంలో రుణాలకు సంబంధించిన విషయంలో ఆర్బీఐ నిబంధనలు పాటించనందుకు గాను రూ.4.35 కోట్ల జరిమానా వేసింది.
అలాగే మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు కూడా ఆర్బీఐ రూ.2 లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ బ్యాంకు తమ బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరికి ఋణం మంజూరు చేసిన కారణంగా ఈ జరిమానా విధించినట్లు వెల్లడించింది. ఈ బ్యాంక్ లో ఇటీవల నాబార్డ్ తనీఖీలు చేసింది. బ్యాంక్ డైరక్టర్ల లో ఒకరికి బ్యాంక్ రుణం మంజూరు చేసినట్లు తనిఖీల్లో తేలింది. దీంతో నిబంధనలను అతిక్రమించిన కారణంగా ఆర్ బీఐ టీడీసీసీకి పెనాల్టీ విధించింది.