EPAPER

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: జీతాలు చెల్లించండి.. పంచాయతీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు..

Palnadu: పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ పంచాయతీ ఆఫీసు కార్యాలయాన్ని పంచాయతీ కార్మికులు ముట్టడించారు. 8 నెలల బకాయిని వెంటనే చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు ఆఫీసుకు తాళాలు వేసి ఆఫీసు ముందు బైఠాయించారు. జగనన్న పుట్టిన రోజున బయట నుంచి కూలీలను తీసుకువచ్చి వీధులను శుభ్రం చేయటం ఏమిటని కార్మికులు ప్రశ్నించారు.


పండుగకు జీతాలు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ ఆఫీసు ముందు బైఠాయించి కదిలేదే లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇప్పటికైనా స్పందించి.. తమకు జీతాలు ఇప్పించాలని కార్మికులు వేడుకుంటున్నారు.

జీతాలు చెల్లించకపోవడంతో.. కార్మికులు పారిశుద్ధ్య పనులను నిలిపివేశారు. దాంతో గ్రామంలో చెత్తా చెదారం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త ఇలానే పేరుకుపోయి ఉంటే.. అంటువ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×