Swedha Patram: అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై తమ వాదన వినిపించేందుకు స్వేదపత్రంతో సిద్ధమైన బీఆర్ఎస్.. తన ప్రెజెంటేషన్ ను వాయిదా వేసుకుంది. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు స్వేదపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంది గులాబీ పార్టీ. అయితే అనువర్య కారణాలతో ఈ ప్రెజెంటేషన్ ను రేపటికి వాయిదా వేసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానాన్ని.. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రేపు వివరించనుంది బీఆర్ఎస్.
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు హరీష్రావు. అయితే అధికార కాంగ్రెస్ పక్షం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్కు ఆ అవకాశం దక్కలేదు. శ్వేతపత్రాల పేరుతో ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి తమపై బురద జల్లేందుకే ప్రయత్నించిందని విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము వివరణలు కోరినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదని.. అందుకే తెలంగాణ భవన్ వేదికగా స్వేద పత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెబుతోంది బీఆర్ఎస్.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గత ఉమ్మడి రాష్ట్ర సమావేశాలను తలపించాయి. చాన్నాళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దాదాపు పదేళ్ల తరువాత అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగాయి. ఆరు రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇటు ప్రభుత్వం.. అటు ప్రతిపక్షం తగ్గేదేలేదంటూ మాటల యుద్ధం కొనసాగింది. ఒకరిపై ఒకరు విమర్శలతో అసెంబ్లీ వేదికగా హీట్ పుట్టించాయి.
.
.