Karnataka Hijab: కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించరాదన్న నిబంధనను ఎత్తివేసింది. ఇప్పటికే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు కూడా జారీ చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్కాసాత్ సబ్కావికాస్ అన్న నినాదం బోగస్ అన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. అందరినీ సమానంగా చూడనప్పుడు ఆ నినాదం కేవలం ప్రచారపు ఆర్భాటం కోసమేనని విమర్శించారు. అందుకే హిజాబ్ బ్యాన్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. తినే ఆహారం, వేసుకునే బట్టలు మన ఇష్టమన్నారు సిద్ధరామయ్య.
కర్ణాటకలోని విద్యాసంస్థల్లోకి మతపరమైన డ్రెస్సులు ధరించి రావొద్దని గతంలో అప్పటి బీజేపీ ప్రభుత్వ నిషేధం విధించింది. దీనిపై గతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించారు.