EPAPER

New York : ఆ ఇండియన్ ఉమెన్ ఆచూకీ కోసం.. ఎఫ్‌బీఐ అదిరిపోయే ఆఫర్..

New York : అమెరికాలోని న్యూజెర్సీలో భారతదేశానికి చెందిన విద్యార్థి నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైంది. అప్పటి నుండి ఆమె కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె ఆచుకీ తెలిపిన వారికి 10,000 డాలర్లు అంటే భారత్ కరెన్సీ ప్రకారం రూ 8.32 లక్షలు కోట్లు రూపాయలను రివార్డ్ గా ప్రకటించింది.

New York : ఆ ఇండియన్ ఉమెన్ ఆచూకీ కోసం.. ఎఫ్‌బీఐ అదిరిపోయే ఆఫర్..

New York : అమెరికాలోని న్యూజెర్సీలో భారతదేశానికి చెందిన విద్యార్థి నాలుగేళ్ళ క్రితం అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె ఆచుకీ తెలిపిన వారికి 10,000 డాలర్లు అంటే భారత్ కరెన్సీ ప్రకారం రూ 8.32 లక్షల రూపాయలను రివార్డ్ గా ప్రకటించింది.


వివరాల్లోకి వెళ్తే 29 ఏళ్ల మయూషీ భగత్ .. 2019న మే 1 వతేదిన న్యూ జెర్సీ సీటీలోని తన నివాసం నుంచి బయటికి వెళ్ళింది. తల్లిదండ్రులు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు స్నేహితులను సంప్రదించినా ఎటువంటి సమాచారం అందలేదు. దీంతో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతి మిస్సింగ్ పై న్యూజెర్సీలోని ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీసులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. నాలుగు ఏళ్ళ నుంచి వెతుకుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ కేసులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. అయితే మయూషీ ఆచుకీ ఇంకా తెలియకపోవడంతో తాజాగా ఎఫ్‌బీఐ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. యువతి అచూకీ సమాచారం ఇచ్చిన వారికి 1000 డాలర్లు రివార్డ్ ప్రకటించింది.


ఇంతకి ఏవరు మయూషీ భగత్
మయూషీ భగత్ 1994న గుజరాత్ రాష్ట్రంలో వడోదరా ప్రాంతంలో జన్మించింది. 2016 లో ఎఫ్1 వీసాపై ఉన్నత చదువులు కోసం అమెరికాలో న్యూయార్క్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతుంది. మయూషీ భగత్ ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు ఉంటుందని. చివరిసారిగా గోదుమ రంగు కళ్ళు , నల్లటి జుట్టు కలిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎఫ్‌బీఐ గత ఏడాది జూలై లో తన వెబ్‌సైట్ లోని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తప్పిపోయిన వ్యక్తిగా లేదా కిడ్నాప్ గురి అయిన వ్యక్తి గా పేర్కొంది. మయూషీ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీసులో గానీ లేదా జెర్సీ ప్రాంతంలోని పోలీసులకు సమాచారం అందించాలని తెలిపింది.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×