Prakasam : ప్రకాశం జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు మాబు, అభినయ్(10), వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావుగా గుర్తించారు. గాయపడ్డవారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.