ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఫోకస్ పెట్టాలని రవిగుప్తా అధికారులకు ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్స్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
అలానే డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహారించాలని అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా అలర్ట్ గా ఉండాలని డీజీపీ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రవిగుప్తా వెల్లడించారు. కాగా ఇటీవల న్యూ ఇయర్ టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతర రాష్ట్రాల పలువురు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు.