Handloom Sector : మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం ఇప్పుడు కష్టాలు, కన్నీళ్ల కలబోత అవుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నేతన్నల పరిస్థితి నేడు దుర్భరంగా మారింది.
దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగం కష్టాల కడలిలో కొట్టుమిట్టు ఆడుతుంది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు చేనత కార్మికులకు ఆకలి తీర్చడం లేదు. ప్రభుత్వాల సహకరం అంతత మత్రామే ఉండడంతో చేనేత రంగం మూలన పడుతుంది.
ఏపీలో అత్యధికంగా బాపట్ల జిల్లా చీరాలలో 20వేల కుటుంబాలు చేనేత రంగం పై ఆధరపడి ఉన్నాయి. కరోనా తర్వత ముడి వస్తువుల రేట్లు అత్యధికంగా పెరిగాయాని వస్త్ర కార్యికులు ఆందోళన వక్తం చేస్తున్నారు. కానీ జీవన ప్రమాణాలలో ఎటువంటి మార్పు రావటం లేదని.. వచ్చే కొద్దీ తమ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చేనేత కార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పవర్ లూమ్స్ రావటంతో తమ మనగడ ప్రశ్నార్ధకంగా మారిందని.. ప్రభుత్వమే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.