కరోనా పీడ వదిలింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్ళీ పంజా విసురుతుంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కరోనా వచ్చింది. ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల చిన్నారి నాలుగైదు రోజులుగా అనారోగ్యంతో ఉంది. తీవ్ర జ్వరంతో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడింది.
దాంతో చిన్నారి తల్లిదండ్రులు తనని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు చిన్నారికి పలు వైద్య పరీక్షలు చేశారు. చిన్నారి ఆరోగ్య రీత్యా కరోనా పరీక్ష కూడా చేయగా పాజిటివ్ వచ్చింది. చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.