శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో హీరో ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా విడుదల సందర్భంగా ప్లెక్సీ ని తయారు చేయించారు. దానిని కట్టేందుకు ఇద్దరు అభిమానులు పైకి లేపారు. పైనే ఉన్న 11 kv హైటెన్షన్ తీగలు తగలడంతో ఇద్దరు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
అందులో మామిల్లపల్లి కి చెందిన బాలరాజ్ (29)అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను పాత చీరలకు పాత సామాన్లు తీసుకుని అమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బాలరాజ్ మరణంతో అతని భార్య కన్నీరు మున్నీరు అయ్యింది. రంగా సినిమా హాల్ వద్ద రహదారిపై కూర్చుని మాకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు ధర్నా చేస్తున్నారు.