SA vs IND 3rd ODI : భారత యువ జట్టు అదరగొట్టింది. గత జనవరిలో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు కుర్ర జట్టు దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలోనే దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. గత సిరీస్ లో ఆటగాళ్లెవరూ జట్టులో లేకపోయినా.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో యువ జట్టు దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్ను గెలుచుకుంది.
సంజు శాంసన్ 108 పరుగులతో సెంచరీ చేయగా.. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 77 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సంజు శాంసన్ నిలవగా.. అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతకు ముందు టీ-20 సిరీస్ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. జనవరి 26 నుంచి టెస్టు సిరీస్ జరగనుంది.
.
.