EPAPER

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..

SA vs IND 3rd ODI : సెంచరీతో చెలరేగిన శాంసన్.. వన్డే సిరీస్ టీమిండియా సొంతం..

SA vs IND 3rd ODI : భారత యువ జట్టు అదరగొట్టింది. గత జనవరిలో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు కుర్ర జట్టు దక్షిణాఫ్రికాను దక్షిణాఫ్రికాలోనే దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంది. గత సిరీస్ లో ఆటగాళ్లెవరూ జట్టులో లేకపోయినా.. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో యువ జట్టు దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్‌ పట్టేసింది. గురువారం ఆఖరి వన్డేలో 78 పరుగుల తేడాతో సఫారీలను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది.


సంజు శాంసన్‌ 108 పరుగులతో సెంచరీ చేయగా.. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ 114 బంతుల్లో 108 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 77 బంతుల్లో 52 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల ధాటికి సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో సిరీస్ భారత్ కైవసం చేసుకుంది.

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా సంజు శాంసన్ నిలవగా.. అర్షదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. అంతకు ముందు టీ-20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. జనవరి 26 నుంచి టెస్టు సిరీస్‌ జరగనుంది.


.

.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×