Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజు పాటు కొనసాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. డిసెంబర్ 21నాటికి సభలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ8, ఎఐఎం7, సీపీఐ ఒక ఎమ్మెల్యేలు ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి శాసన సభ సమావేశం ఇది.