Akbaruddin owaisi
Akbaruddin owaisi: అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఎంఐఎం పార్టీలు చేసిన కామెంట్స్ను గుర్తుచేశారు. బీజేపీకి ఎంఐఎం బీ టీమ్ అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని అసెంబ్లీలో అక్బరుద్దీన్ చెప్పారు. తాజాగా.. ఆ కామెంట్ పై అక్బరుద్దీన్ మాట్టాడుతూ తాము ఎవరికీ బీ టీమ్ కాదని.. ప్రాణం పోయినా కానీ, బీజేపీతో కలిసి నడవబోము అని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలోనే పాతబస్తీ అభివృద్ధి చెందిందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిందని అక్బరుద్దీన్ గుర్తు చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటు కంటే తెలంగాణ ముందుందని అక్బరుద్దీన్ తెలిపారు.
మేం ముస్లింల హక్కుల కోసమే పోరాడామన్నారు. రాష్ట్ర అభివృద్దికి ఎప్పటికీ మేం సిద్దంగా ఉంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.