AP Pension scheme : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ ను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు చేయనుంది.
Andhra pradesh : ఏపీ ప్రభుత్వం పెన్షన్ దారులకు తీపి కబురు చెప్పింది.పెన్షన్ మొత్తాన్ని రూ.3,000 లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పెన్షన్ లను వచ్చే ఏడాది జనవరి ఒకటో తేది నుంచి అమలు లోకి రానుంది.
గత ఎన్నికల హామీలలో భాగంగా పెన్షన్ రూ.3,000 వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా రూ.2,000 రూపాయలు ఉన్న పెన్షన్ను మొదటివిడతగా రూ. 2,250 కి పెంచింది. పలు దఫాలుగా రూ.250 రూపాయలు కలుపుతూ విడతలు వారిగా పెంచుతూ ఇప్పుడు ఇస్తున్న రూ. 2,750 రూపాయలకు అదనంగా 250 కలిపి మొత్తంగా రూ.3,000 రూపాయలకి పెంచింది.