NTR 31 movie Update : ప్రభాస్ సలార్ 2 మూవీ తర్వత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ఈ మూవీ ను ఎనౌన్స్ చేశారు. ఈ మూవీ లో మైథలాజికల్ టచ్ తో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఫిక్షనల్ కంటెంట్ ఉంటుందట. ఈ మూవీ ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా.. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రేపు విడుదల కానుంది.
ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా వీలైనంత వేగంగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చి.. ఆ తర్వాత ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తారంట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి బూస్ట్ ఇచ్చే విధంగా ఉంది.
ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే ప్రశాంత్ ట్రేడ్ మార్క్ ప్రతి సినిమా రెండు భాగాల్లో తీయడం.. ఇప్పటివరకు అతని దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ రెండు భాగాల్లో విడుదలైంది .సలార్ కూడా రెండు భాగాలు గా వస్తోంది.ఇప్పుడు ఎన్టీఆర్ తో తీయబోయే సరికొత్త చిత్రం కూడా రెండు భాగాలు అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ సిద్ధంగా ఉందని.. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇక ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ పెట్టడానికి మైత్రి సంస్థ సిద్ధంగా ఉంది. ఈ సంస్థ ప్రస్తుతం అత్యధిక బడ్జెట్ తో పుష్ప 2 చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే రాబోయే ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ పుష్ప సినిమాని మించి ఉంటుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం తారక్, కొరటాల శివ కాంబినేషన్లో దేవర చిత్రం షూటింగ్లో బాగా బిజీగా ఉన్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వచ్చే హాట్ సమ్మర్ కూల్ ట్రీట్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తర్వాత బాలీవుడ్ వార్ 2 చిత్రంలో నటించబోతున్నారు. ఇక ఆ తర్వాతే ప్రశాంత్ తో కలిసి ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది .. ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.