EPAPER

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?

Arvind Kejriwal : ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆ కార్యక్రమం కోసమేనా?
Arvind Kejriwal update news

Arvind Kejriwal update news(Telugu flash news):

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఈనెల 21న విచారణకు హాజరుకావాలని సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విపాసన ధ్యానం కోసం కేజ్రీవాల్ గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.


కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మెడిటేషన్ కార్యక్రమం నేపథ్యంలోనే ఆయన హాజరు కాలేకపోయారని ఆప్ నేతలు అంటున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని ఆప్ ఎంపీ రాఘవ్‌ చద్దా చెప్పుకొచ్చారు. ఏటా విసాసన మెడిటేషన్ కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొంటారని ఆయన తెలిపారు. గతంలో కూడా బెంగళూరు, జైపూర్ వంటి నగరాల్లో ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు సీఎం కేజ్రీవాల్ వెళ్లారని ఎంపీ గుర్తు చేశారు.

అయితే ఈ యోగా కార్యక్రమం ఈడీ నోటీసుల కంటే ముందుగానే నిర్ణయించినదని తెలిపారు. ఈడీ విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని ఎంపీ రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో గతంలో కూడా ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు.


Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×