ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు నేడు. ఈ వేడుకను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఊరువాడా ఘనంగా నిర్వహిస్తున్నారు. కేకులు కట్ చేస్తున్నారు. సీఎం జగన్ కు పలువురు రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు .
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీవెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.సంక్షేమ సామ్రాట్ జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి రోజా ట్వీట్ చేశారు. మంత్రి అంబటి రాంబాబు.. సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటుతున్నారు. పేదలు అన్నదానం చేస్తున్నారు. వస్త్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పళ్లు అందిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేస్తున్నారు.