EPAPER
Kirrak Couples Episode 1

Patanjali: “రామేశ్వరంలో కాకులు.. మరికొన్ని కథలు”.. తెలుగు కవికి కేంద్ర సాహిత్య పురస్కారం..

Patanjali:  “రామేశ్వరంలో కాకులు.. మరికొన్ని కథలు”..  తెలుగు కవికి కేంద్ర సాహిత్య పురస్కారం..

Patanjali: ప్రముఖ తెలుగు కథా, నవలా రచయిత పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రాసిన “రామేశ్వరం కాకులు ..మరికొన్ని కథలు” అనే లఘ కథల పుస్తకానికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా రోడ్డులో రబీంద్ర భవన్‌లోని సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 24 భాషల్లో రచించిన కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది.


పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. ఆయన ఒంగోలు కళాశాలలో చదువుకున్నారు. ఉన్నత విద్యను తిరుపతి, పుణెలో చదివారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక దక్కన్ కాలేజీ నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్ గా పతంజలి శాస్త్రి పని చేశారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరువు వంటి కథా సంపుటాలు ఆయన రచనల్లో ముఖ్యమైనవి. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకూ పలు కథలను “రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు” పేరిట పుస్తకంగా రచించారు. దీనికే ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.


Tags

Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×